ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకే మంత్రి పదవి..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 02:26 PM

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పినట్టుగానే సరిగ్గా రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ చేపడతానని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున చెప్పారు. ఇందులో భాగంగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించనున్నట్లు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


సామాజిక వర్గాల నడుమ సమతుల్యత సాధించాలనే తపన మాత్రం ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖ మన్యం నుంచి గిరిజనుల మన్ననలు పొందుతున్న ఆదివాసి ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విశాఖ జిల్లా నుంచి మంత్రి రేసులో ఉండగా దాదాపు మంత్రి పదవి బెర్తు ఖాయమమైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖ మన్యంలో గిరిజనులకు తమ వంతు ఎనలేని విశేష సేవలందిస్తూ.. మన్యం గిరిజనుల కోసం ఇప్పటికే సొంతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి గిరిజనుల ద్వారా నీరాజనాలు అందుకుంటూ మచ్చలేని ఎమ్మెల్యేగా పాలన కొనసాగుతున్నారు. మన్యం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న అరుకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకే మంత్రి పదవి ఖాయం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com