ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసు రెడ్డి తెలిపారు. వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతున్నందున ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. విజయవాడలోని దేవినగర్ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ .. విద్యుత్ కోతల నివారణకు అవసరమైతే ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందజేస్తామని పేర్కొన్నారు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మంజూరైన సబ్స్టేషన్లలో మూడింటి పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలను తొలగించేందుకు నిధుల సమస్య రాకుండా ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.