విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రం సమీపంలోని స్వర్ణముఖి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మక్కువ చాకలి రేవు సమీపంలో శవం తేలియాడుతున్న విషయాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. మృతుడు మక్కువ మండలం డబ్బూరి వలస గ్రామానికి చెందిన బారు రామారావుగా గుర్తించారు .మంగళవారం రాత్రి రామారావు ప్రమాదవశాత్తూ సువర్ణముఖి నదిలో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం తల్లి గౌరమ్మ వద్దే ఉంటున్నట్లు తెలిసింది. భార్యాబిడ్డలు పార్వతీపురం మండలం విక్రాంపురం గ్రామంలో ఉంటున్నట్లు సమాచారం. మృతుడు మద్యం సేవించే అలవాటు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నదిలో మృతదేహం పడి ఉన్న విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలియవస్తుంది. పోలీసులు దర్యాఫ్తులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.