ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్న రీతిలో ప్రైవేటీకరణ ఉద్యమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 01:27 PM

ఏపీ జెన్కో ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ అనే పదం చెడు మాటతో సమానమని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీ జెన్కో బ్రాంచ్ నాయకులు కృష్ణ చైతన్య, గుమ్మడి శ్రీనివాసులు సంయుక్తంగా విమర్శించారు.


మంగళవారం ముత్తుకూరు లో ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని వినూత్న రీతిలో చేపట్టారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక, విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ప్రాజెక్టు ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, కాంటాక్ట్ కార్మికులు చేసిన నిరసన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.


వీళ్ళందరూ చెవులు, ముక్కు, కళ్ళు, మూసుకొని నిరసన తెలిపారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, అనే నినాదంతో నిరసన నిర్వహించారు. వందల మంది కార్మికులు ఇంజనీర్లు ఉద్యోగస్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు గంట సేపు ఈ నిరసన కొనసాగింది.


అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడారు. ప్రాజెక్టు ప్రైవేటీకరణ అనే పదాన్ని చాలామంది వింటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జేఏసీ నాయకులు అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టు ప్రైవేటీకరణ ముగించుకోవాలి అని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ నాయకులు లక్ష్మణ్ , అనంత, నందకుమార్, రాజేష్, ముని ప్రసాద్ , సుధాకర్, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు నాగరాజు, సుధాకర్, రవీంద్ర, గాలి అంకయ్య, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com