రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న స్వచ్ఛ సంకల్పం” తో పాటు గ్రామ పంచాయతీల్లో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి ఇందుకూరుపేట పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడంలో ముఖ్యమైన ఆదాయవనరైన ఇంటిపన్ను వసూళ్ళను 100 శాతం పూర్తి చేయాలన్నారు. అలాగే పన్నేతర వసూళ్ళ లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని సూచించడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో పరిపాలన పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.