కృష్ణా: జగ్గయ్యపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి అమ్ముతున్న కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2వేలు జరిమానాను విధించినట్టు ఎస్సై రామారావు బుధవారం తెలిపారు. జగ్గయ్యపేట అడిషనల్ సివిల్ కోర్ట్ జడ్జి ఎస్. కె రేహనా సాక్ష్యాలను విచారించి తీర్పు వెలువరించినట్లు వారు తెలిపారు. కాగా శిక్ష పడిన వ్యక్తి గుంటూరు జిల్లా బాపట్ల మండలం వేదులపల్లి గ్రామానికి చెందిన మానుపటి దుర్గా ప్రసాద్ అలియాస్ చిన్నోడుగా ప్రకటించారు.