విజయవాడ నగరం 30 వ డివిజన్ దేవీనగర్ లో రూ. 3. 60 కోట్ల వ్యయంతో చేపట్టిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాని నేడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపి ఇంధనం, అటవీ & పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ శాఖామాత్యులు మాన్య శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమిపూజ నిర్వహించారు. నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీమతి అవుతు శ్రీశైలజారెడ్డి , వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.