ప్రకాశం: కందుకూరు మండలం కొండముడుసు పాలెంలో కట్టా పూర్ణ (35)అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కట్టా పూర్ణ భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలసి స్థానిక గ్రామంలో నివసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె నివాసంలో ఘర్షణ జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం వివాహిత మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ ఐ కిషోర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.