నెల్లూరు: సూళ్లూరుపేట లోని చెంగాళమ్మ ఆలయ సమీపం లో ఉన్న కాళంగి నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 40 నుండి 50 ఏళ్ళ మధ్య వయసు ఉంటుంది. అతని బట్టలు నది ఒడ్డున ఉండటాన్ని బట్టి స్నానం చేయడానికి నదిలోకి దిగి మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మృతుని ఒంటి పై సరోజ, అక్షయ, శరవణన్, వల్లి అనే పేర్లు పచ్చబొట్లుగా వేసుకుని ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.