ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగం డెయిరీ బాధ్యతలపై ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 04:26 PM

సంగం డెయిరీ బాధ్యతలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇకపై ట్రస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.డెయిరీ చైర్మన్‌గా ఎవరుంటారో.. వారే ట్రస్ట్‌ బాధ్యతలు చూస్తారన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తనపై విమర్శలు చేస్తున్నారని, ట్రస్ట్‌ ఆస్తులను తాము కాజేసినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు కార్యకలాపాలు సంగం డెయిరీ పాలకవర్గం నిర్వహిస్తుందన్నారు. డెయిరీలో పనిచేసి వెళ్లినవారే ఇప్పుడు పిటిషన్లు వేసి ట్రస్టును వివాదాల్లోకి లాగారన్నారు. పిటిషన్లు వేసేందుకు వారిని కొందరు వెనకుండి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ వారైనా.. ఇతర పార్టీ వారైనా రాజకీయంగా తేల్చుకుంటానన్నారు. ట్రస్టును రాజకీయాల్లోకి లాగడం సరికాదని ధూళిపాళ్ల నరేంద్ర హితవుపలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com