నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళవారం సుమారు 18 వేల రూపాయల విలువ చేసే 20 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కావలి ఏఎస్పీ దేవరకొండ ప్రసాద్ విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో హోటల్ నిర్వహిస్తూ అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వాగిచర్ల పవన్ కుమార్ (40), అక్రమ మద్యాన్ని కావలి పట్టణంలో అధిక ధరకు విక్రయిస్తున్న శానం శేషు బాబు(41) లను చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా సరఫరా చేసి రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించామని, సెబ్ అధికారుల సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ తెలియజేశారు.