కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో మంగళవారం ఉదయం వివిధ సమస్యలపై మంత్రి కార్యాలయానికి వచ్చిన ప్రజల వద్ద నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు అడిగి రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలుసుకున్నారు. వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీలను సంబంధిత శాఖాధికారులకు బదిలీ చేసి 24 గంటల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.