ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 ఏళ్లపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:47 PM

నందిగామ మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నుండి ఉలవలపూడి ముత్తయ్య ఆధ్వర్యంలో 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో మరో 30 ఏళ్లపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించారని ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని తెలిపారు.


గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కోమాలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం గ్రామాలు తిరుగుతూ అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని , తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు నలుగురు సామంతరాజులు ని ఏర్పాటు చేసి దోచుకోవడం దాచుకోవడం లక్ష్యంగా అవినీతి చేసి నందిగామ బ్రష్టు పట్టించారని తెలిపారు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే నందిగామ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com