ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్య ద్రోహి: పోతిన మహేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:44 PM

జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ విజయవంతం అయ్యిందని జనసేనకు జనాదరణ చూసి తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేసారు. వైసిపి వాళ్ళు గెలిచింది జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి కాదని షర్మిళ పాదయాత్ర వల్ల, విజయమ్మ, బ్రదర్ అనిల్ కృషి చేస్తే గెలిచారని పేర్కొన్నారు. వైసీపీ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో150 దేవాలయాల పై దాడులు జరిగితే మంత్రి వెల్లంపల్లి ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. వైసిపి పార్టీ అంటే ఈస్ట్ ఇండియా కంపెని అని వ్యాపారం తప్ప ఏమీ చేయట్లేదని విమర్శించారు. వైసిపి ప్రభుత్వం పతనానికి నిన్నటి పవన్ కళ్యాణ్ సభ తో నాంది పలికిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com