ఏపీలో విశాఖపట్నం నగరం మంగళవారం ఉలిక్కి పడింది. గాజువాక హెచ్పీసీఎల్ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల అవుతుండడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమకు సమీపంలో ఉన్న మల్కాపురం ప్రజలు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిఫైనరీ నుంచి విష వాయువులు లీక్ అవుతున్న కారణంగా స్థానికులకు శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి, నివారణ చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇక 2020 మే 7న విశాఖలోని ఎల్సీ పాలిమర్స్ సంస్థ నుంచి విషవాయువులు లీక్ అయి, 12 మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అయితే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.