సోమవారం రాత్రి కందుకూరు - కావలి రోడ్ లో దారి దోపిడీ జరిగింది. మోటార్ బైక్ పై కందుకూరు వెళ్తున్న యువకుడిని ఆరుగురు దుండగులు అడ్డుకుని తీవ్రంగా గాయపరిచి అతని దగ్గర ఉన్న రూ. లక్షా 50 వేలు నగదును దోచుకుపోయారు. రోడ్డు పక్కన నిర్మానుష్య ప్రదేశంలో స్పృహ లేకుండా పడి ఉన్న అతనిని కొందరు గమనించి రక్షించడంతో దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని కందుకూరు హాస్పిటల్ కు తరలించారు.