విజువల్ పొలిసింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మాడుగుల మండలంలో పలు చోట్ల పొలీసులు తనిఖీలు నిర్వహించారు. తాటిపర్తి, షూట్ రోడ్, ఎం కోటపాడు ప్రాంతాల్లో ఎస్ ఐ పి రామారావు ఆద్వర్యంలో తనిఖీలు నిర్వహించి లైసెన్సులు తనిఖీ చేసి పెండింగ్ చలానాలు చెల్లించాలని సూచించారు. అలాగే వాహనాల్లో నిషేధిత గంజాయి వంటివి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.