ఉక్రెయిన్ రష్యా సరిహద్దులో తాము ఉన్న సుమి అనే ప్రదేశం నుంచే దగ్గరగా రష్యా సైనిక బృందాలు, బ్యాంకు, యుద్ధ సామగ్రితో వెళ్లేవని అయినా బంకర్లలో తలదాచుకుంటూ ధైర్యంగా గడిపామని ఉక్రెయిన్ సుమి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి యానాంకు చెందిన ఉజ్జూరి ప్రభుదాసు అన్నారు. ఉక్రెయిన్ నుంచి సోమవారం యానాం చేరుకున్న ప్రభుదాసు అక్కడి ఘటనలను, యుద్ధ క్షేత్రం నుంచి స్వదేశానికి చేరుకున్న వైనాన్ని వివరించారు. సుమి రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉందన్నారు. రష్యాకు చేరాలంటే 50 నిమిషాలు సరిపోతుందన్నారు. యుద్ధం మొద లైనప్పటి నుంచి వైద్య విద్యార్థులను అందరినీ బంకర్లో పెట్టేవారన్నారు. సైరెన్ మోగిందంటే తామంతాబంకర్లలో తలదాచుకునే వాళ్లమని, మళ్లీ యుద్ధ విమా నాలు రాకపోతేనే బయటకు వచ్చేవాళ్లమని అన్నారు. అక్కడ ఉండే ఉక్రెయిన్ విద్యార్థులు తమకు ఎంతగానో సహాయ పడేవారని ఆహారాన్ని అందించేవారని తెలిపారు. మార్చి 8న సుమి నుంచి 22 బస్సులలో తమను తరలించేందుకు ఏర్పాటు చేశారని, అక్కడ నుంచి పాల్రావు అధికారులు తీసుకువచ్చారన్నారు. బస్సులకు ఇండియన్ ప్లాగ్ అతికించి భద్రత మధ్య తీసుకువచ్చారన్నారు. అక్కడ నుంచి లివివ్ అనే పట్టణానికి రైలులో తరలించారన్నారు. అక్కడ నుంచి పోలెండ్ సరిహద్దుకు చేర్చారన్నారు. అక్కడ నుంచి మూడు బ్యాచ్ లుగా 700 మంది విద్యార్థులను విమానాల్లో ఢిల్లీకి తరలించినట్టు తెలిపారు. అక్కడ నుంచి హైదరాబాద్ మీదుగా రాజమహేంద్రవరానికి వచ్చామన్నారు.