విజయనగరం: గుమ్మలక్ష్మీపురం మండలంలోని అచ్చబ గ్రామంలో కాలిన గాయాలతో ఇంటివద్ద బాధపడుతున్న నిమ్మక వైష్ణవికి మెరుగైన వైద్యం అందించేందుకు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే. చిన్నారి వైష్ణవి తోటి స్నేహితులతో గ్రామంలో చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తూ మంటలో పడిపోయింది. దీంతో చిన్నారి శరీరం 30 శాతం కాలిపోయింది. అయితే కుటుంబ సభ్యులు వైష్ణవిని ఇంటివద్దే ఉంచి నాటు వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్విన్పేట సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్సై షణ్ముఖరావు గ్రామానికి వెళ్లి చిన్నారిని 108 వాహనంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.