ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మూడు రోజుల పాటు సెలవుల అనంతరం ఈరోజు ప్రారంభమైన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ వెల్లోకి దూసుకువచ్చి నిరసనలు తెలియ జేయడంతో సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. పట్టువీడని దేశం సభ్యులు కాగితాలను చింపివేసి స్పీకర్పై పడవేశారు.