రైల్వే స్టేషన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 13 మందిని.. రెండున్నర గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నై నున్గబాక్కమ్ రైల్వే స్టేషన్ లో ఏడాదిన్నర చిన్నారి సహా 13 మంది లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో..రైల్వే సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగి
లిఫ్ట్ ను సరిచేసేందుకు.అనేక ప్రయత్నాలు చేశారు. అయినా లిఫ్ట్ కదల్లేదు. ఏం చేయాలో తోచని రైల్వే అధికారులు.... పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయం కోరారు. వారు వచ్చి లిఫ్ట్ పైన ఉండే ఫ్యాన్ తొలిగించి. ఆ రంధ్రం నుంచి ఒక్కో ప్రయాణికుడిని బయటకు తీసుకొచ్చారు. దాదాపు రెండున్నర గంటలు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయిన ప్రయాణికులు.క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.