చిత్తూరు: గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక పార్క్ ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతానికి గుర్తుతెలియని దుండగులు ఆదివారం నిప్పు పెట్టి పారిపోయారు. ఈ కారణంగా పచ్చని చెట్లు, మొక్కలు, అడవి గడ్డి పెద్ద ఎత్తున అగ్ని ఆహుతిలో కాలి బూడిదైన ఘటన చోటుచేసుకుంది. సమీపంలోని కన్నికాలమ్మ కొండ ప్రాంతం పూర్తిగా అగ్నిలో కాలి బూడిదైంది. ఈ సందర్భంగా అడవిలోని ఎన్నో జీవరాశులు సైతం మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయింది.