కృష్ణా జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా నేడు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో గన్నవరం నియోజకవర్గం పోట్టిపాడు టోల్ గేట్ వద్ద ఎసిపి విజయపాల్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో స్థానిక సీఐ కోమకులా శివాజి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.