తమ డిమాండ్ లను నెరవేర్చాలని అంగన్ వాడీ కార్యకర్తలు చేపట్టిన "చలో విజయవాడ" ను పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు. చలో విజయవాడను విజయవంతం చేసి తీరుతామని మధ్యాహ్న భోజన కార్మికులు తేల్చిచెబుతుండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ టీ.వి భారత్ లో వచ్చిన కధనం ప్రకారం, చలో విజయవాడకు అనుమతి లేదన్న పోలీసులు, నోటీసులు ఇచ్చి కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్భంధాలు చేస్తున్నారు. దీంతో పోలీసులపై.. మధ్యాహ్న భోజన కార్మికులు మండిపడుతున్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 40 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయని. వాటిలో 88 వేల మంది పని చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని అక్షయపాత్ర సంస్థకు ఇవ్వడం వల్ల తమ ఉపాధి దెబ్బతిందని వాపోతున్నారు. నిరసనను అడ్డుకోవద్దని కోరుతున్నారు.
విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నగరంలోని కార్మిక సంఘాల నాయకుల ఇళ్ల ముందు కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు ధర్నా చౌక్ లో కూడా వందల మంది పోలీసులతో ఉన్నతాధికారులు భద్రత చర్యలు చేపట్టారు. విజయవాడ దాసరి భవనం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఐటీయూసీ నాయకులు ధర్నాకు బయల్దేరుతుండగా.. పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది.
కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో.. మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులను నిర్బంధించారు. చలో విజయవాడకు వెళ్తున్న సీఐటీయూ నాయకులు సహా పలువురుని అరెస్టు చేశారు.