జాతీయ రహదారి జూ పార్క్ వద్ద సిగ్నల్ పాయింట్ వద్ద లారీ-కారు ఢీకొన్న ఘటనలో కారులో వున్న దంపతులకు గాయాలయ్యాయి. ఎండాడ నుంచి హనుమంతువాక వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు జూ పార్క్ జంక్షన్ వద్ద ఢీకొన్నట్టు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఎ సన్యాసిరావు పేర్కొన్నారు. నగరానికి చెందిన వెంకటరమణ, భార్య భారతి, చిన్నారి కుమార్తె కారులో నగరం వైపు వస్తుండగాఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు.లారీ వెనుక వున్న (ఇనుపరాడ్) కారుముందు భాగంలోకి దూసుకుపోగా దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెనుక సీటులో కూర్చున్న చిన్నారికి చిన్నపాటి గాయాలు అయ్యాయని..స్థానిక మెడీ కవర్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేసినట్టు పేర్కొన్నారు. కాగా వెంకటరమణ నగరంలోని ఒక సంస్థలో సైంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ట్టు సమాచారం. ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.