ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2 లక్షల వేతనంతో హెచ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 03:59 PM

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వీటికి రాత పరీక్ష లేదు. మొత్తం 40 ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, సీనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు ఖాళీలున్నాయి. హెచ్‌ఆర్, ఫైనాన్స్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో ఆ ఉద్యోగ ఖాళీలున్నాయి. ఆయా పోస్టుల ఆధారంగా కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ వంటివి కలిగి ఉండాలి. ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు రూ.52 వేల నుంచి రూ.2.20 లక్షల వరకు చెల్లిస్తారు. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత ప్రతులను జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, గాంధీగ్రామ్‌(పీఓ), విశాఖపట్నం–530005 చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించడానికి తుది గడువు ఏప్రిల్ 20, 2022 వరకు ఉంది. వాటి ప్రతులను ఆఫ్‌లైన్‌లో పంపించడానికి ఏప్రిల్ 25, 2022ను తుది గడువుగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://www.hslvizag.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com