కృష్ణా జిల్లా: యువతి అదృశ్యమైన ఘటన శనివారం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన సాలి మాలిని అనే యువతి ఈనెల 9వ తేదీన విజయవాడ వెళుతున్నాను అని చెప్పి నేటి వరకు తిరిగి రాకపోవడంతో మాలిని పిన్ని మండల మరియు కుమారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.