కృష్ణా జిల్లా: వై. యస్. అర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి రాష్ట్ర వైయస్. ఆర్. సిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటి సభ్యులు డా. దుట్టా రామచంద్ర రావు, రాష్ట్ర వైయస్ ఆర్ సిపి వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ గోసుల శివభరత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాపులపాడు జడ్పీటీసీ సభ్యురాలు కొమరవెల్లి గంగా భవానీ, బాపులపాడు గ్రామ సర్పంచ్ సరిపల్లి కమలాభాయ్ , బొమ్ములూరు సర్పంచ్ విజయ్ బాస్కర్ కాటూరి, నరసన్నపాలెం సర్పంచ్ అడపా అంజిబాబు గారు. వైయస్ ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.