గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను.....పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు.... పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే లక్ష్యంతో సభ నిర్వహిస్తున్నట్లు..... మనోహర్ తెలిపారు. సభా ప్రాంగణానికి.....మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టినట్లు తెలిపారు.