యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు సమీపంలోని ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఉప్పలపాడు గ్రామానికి చెందిన నాగన్న గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. రోడ్డు పక్కన వెళుతున్న గొర్రెలపై లారీ దూసుకెళ్లడంతో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరు గొర్రెలు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నట్లు బాధితుడు తమ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని బాధితుడు గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలిసింది.