నెల్లూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను ఇందుకూరుపేట ఎస్ఈబి పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పజెప్పారు. మండలంలోని నగరజు తోపు రహదారిపై తనిఖీలు చేస్తున్న సమయంలో నెల్లూరు వెళ్తున్న ట్రాక్టర్ కు ఎటువంటి బిల్లు లేకపోవడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి ట్రాక్టర్ ను స్థానిక పోలీసులకు చెప్పినట్లు ఎస్ఈబి పోలీసులు తెలిపారు.