నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం సెంటర్ నుండి ర్యాలీ, గాంధీ గిరిజన కాలనీ సచివాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ 53, 54 డివిజన్లలో 50 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని వారందరికీ ఆర్థిక లావాదేవీలు నడుపుటకు ఉన్న ఏకైక ప్రభుత్వ బ్యాంకు కెనరా బ్యాంక్ ను నవాబ్ పేటకు తరలించారని దీంతో స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే వెంకటేశ్వర పురం లో ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనేక రోజుల నుండి నుండి కొళాయిలలో మురికి నీళ్లు వస్తుంటే అధికారులు పాలకులు చోద్యం చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్షురాలు కత్తి పద్మ, స్థానిక నాయకులు ఈశ్వరయ్య, బయ్యన్న, సుబ్రహ్మణ్యం, షకీలా, నాగేశ్వరమ్మ తిరుపతమ్మ, అఖిల్, సాజిద్, వంశీ తదితరులు పాల్గొన్నారు.