కృష్ణా జిల్లా: నందిగామ డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించిన బీసీ మహిళలు, పార్టీలకు అతీతంగా భారీగా తరలివచ్చిన బీసీ మహిళలు విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బెటాయించారు. మహిళల ఆందోళనతో భారీగా నిలిచిపోయిన వాహనాలు.
ఇద్దరు మహిళలను వివస్త్ర చేసి దాడిచేసిన ఘటనపై నిరసన చేపట్టారు. బంగారం కాజేశారంటూ మహిళలను వివస్త్ర చేసి కొట్టిన ఘటన పైచందర్లపాడు మండలం ముప్పాళ్లలో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.