విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కల 60 వ డివిజన్ - వాంబేకాలనీ E, F & G బ్లాక్స్ నందు ప్రజలకు నీటిసరఫరా మెరుగుపరుచుట కొరకు పవర్ బోర్లు మరియు మంచినీటి సరఫరా పైప్ లైన్ పనులకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో మోలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 14, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. అమృత్ పథకం ద్వారా శివారు ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.