రెండు నెలల ప్రేమ.. యువకుని ప్రాణం తీసింది. వివరాలలోకి వెళితే.. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని ఆమె కోరగా.. ఇప్పుడొద్దులే అన్నాడు. ఎంతకీ మాట వినకపోవడంతో ప్రేయసి పోలీసుల్ని ఆశ్రయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎస్సై మహేశ్ వివరాల మేరకు భోగాపురం మండలంలోని దల్లిపేటకు చెందిన కె.శ్రీను(29) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. రెండునెలల క్రితం విశాఖపట్నంలోని ఇసుకతోటలో పనికి వెళ్లినప్పుడు ఓ యువతి పరిచయం కాగా, ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకోవాలని ఆమె కోరినా నిరాకరించడంతో ఎంవీపీ కాలనీ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత ఇరువర్గాల పెద్దలు మాట్లాడి నచ్చజెప్పినా శ్రీను అంగీకరించలేదు. దీంతో ఆమె మళ్లీ సేషన్కు వెళ్లింది. మనస్తాపం చెందిన యువకుడు గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలొదిలాడు. తండ్రి పైడినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.