ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మచిలీపట్నంకు సంబంధించి మాస్టర్ ప్లాన్ త్వరలో ఆమోదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 10, 2022, 12:44 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గతంలో కౌన్సిలర్లు , వార్డు సెక్రటరీలు ప్రతిపాదించిన మార్పులను మరోమారు పరిశీలించి అవసరమైన సవరణలు చేర్పులు చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంట్రామయ్య (నాని) స్పష్టం చేశారు.


బుధవారం సాయంత్రం ఆయన ముడా కార్యాలయంలో మచిలీపట్నం పరిధిలోని 50 డివిజన్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి గూగుల్ మ్యాప్ శాటిలైట్ చిత్రాల సహాయంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మునిసిపల్ , ముడా ప్లానింగ్ అధికారులతో పలు విషయాలపై సమీక్షించారు.


మచిలీపట్నం పోర్టు భూములన్ని ఎరుపురంగుతో మార్కు చేయాలని, కమర్షియల్ రోడ్లన్నీ 50 అడుగులు చేయాలనీ మంత్రి పేర్ని నాని అధికారులకు ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధిలోకి వస్తే 20 వేల మంది ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ సమావేశంలోముడా వీసి బి ఎస్ నారాయణరెడ్డి, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ , మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్, మచిలీపట్నం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు, మచిలీపట్నం నగరపాలక సంస్థ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com