ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు లైన్ల రహదారి ఆశలపై నీళ్లు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 04:46 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రజలు గత కొద్దికాలంగా ఆరు లైన్ల రహదారి వస్తుందని బెంగళూరు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం వెళ్లేవారికి ప్రయాణం ఇంకా సులభతరం అవుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలపై సంబంధిత అధికారులు నీళ్లు చల్లారు. బి. కె. వి ప్రాజెక్ట్ పేరుతో బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించనున్నారు.


ఎక్స్ ప్రెస్ హైవే బెంగళూరు నుండి ప్రారంభమై అనంతపురం మీదుగా పోరుమామిళ్ల కు చేరుకుంటుంది. అక్కడ నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మీదుగా పామూరు, కనిగిరి, చీమకుర్తి, పెద్ద ఉయ్యాలవాడ, రామభద్రపురం శివరామపురం తాళ్లూరు మన్నేపల్లి అద్దంకి ముప్పవరం గ్రామం వరకు రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి.


అనంతరం ఈ రహదారి చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారి ఎన్. హెచ్16 లో కలవనుంది. ప్రకాశం జిల్లాలో ఈ రహదారి మొత్తం 126 కిలోమీటర్లు ఉండనుంది. 17 వేల కోట్ల రూపాయల వ్యయంతో 624 కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు.


జివిఎంసి పరిధిలో 530 కిలోమీటర్లు ఉండనుంది. అయితే ఈ రహదారిలోకి అన్నిచోట్ల నుంచి ప్రవేశించేందుకు అవకాశం ఉండదు. 624 కిలోమీటర్ల దూరంలో కేవలం 13 చోట్ల నుంచే ఈ రహదారిలోకి వాహనదారులు ప్రవేశించేందుకు వీలుగా అధికారులు రూపకల్పన చేస్తున్నారు. దాంతో పాటు ఈ రహదారిలో 120 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించవచ్చు అని అధికారులు ఆ విధంగా రోడ్డును డిజైన్ చేస్తున్నారు.


ఇప్పటివరకు పచ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే సుదీర్ఘంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన క్రమంలో అమరావతి అనంతపురం రహదారులతో పాటు కడప అమరావతి రహదారులను విస్తరించి ఈ ప్రాంత ప్రజలకు ప్రయాణ సౌలభ్యం తీసుకువస్తారు అనుకున్న ప్రజలకు ప్రభుత్వం అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. మొత్తానికి రహదారులు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేవరకు ఏమి జరుగుతుందో అని ప్రజలు ఈ అంశంపై వేచి చూడక తప్పదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com