ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని గిద్దలూరు రైల్వే స్టేషన్ సంబంధిత రైల్వే ట్రాక్ పై ప్రభాకర్ (70) అనే వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు తెలియవలసి ఉందని అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.