నెల్లూరు: నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రమాదేవి (35) మృతి చెందగా మరో ఇద్దరు యువతులకు తీవ్రగాయాలు అయిన ఘటన చోటు చేసుకుంది.
నాయుడుపేట మండలం నర్సారెడ్డి కండిగ గ్రామసమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రమాదేవి మరో ఇద్దరు యువతులు సునీత, సుకన్యలు కార్ లో వస్తుండగా వేగంగా వస్తుండగా కార్ ఢీ కొంది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.