ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. సైదాపురం సమీపంలో ఓ విదేశీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. లూథియానా దేశానికి చెందిన కరోలినా అనే మహిళ భారత్ లో విహార యాత్రకు వచ్చారు. ఈ నెల 7న చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కారు. ఆమె దగ్గర ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు దించేందుకు ప్రయత్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళేనికి చెందిన సాయి కుమార్ ఆ టికెట్కు డబ్బు చెల్లించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను నమ్మించి తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన తన స్నేహితుడు షేక్ అబిద్తో కలిసి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న కరోలినా స్థానికుల సాయంతో సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్ని చిల్లకూరు జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.