ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 02:44 PM

సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేసి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చేందుకు మేకపాటి గౌతమ్ రెడ్డి పడిన శ్రమ ఎనలేనిదని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌ రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు. 


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com