తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో జిల్లా మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంగళవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ ఆవరణలో గల సమావేశం హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ హరి కిరణ్, సుగుణ దంపతులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. చిన్నపిల్లల సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.