మహిళాసాధికారతతోనేసమాజ అభివద్ధిసాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. అంతర్జాతీయమహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అంతర్జాతీయ మహిళాదినోత్సవకార్యక్రమాలలో భాగంగాజిల్లా ఎస్ పి స్థానిక రిజర్వు పోలీస్ లైన్స్ లోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో ట్రస్ట్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు ను లాంఛనంగా ప్రారంభించినారు. ఈ మెడికల్ క్యాంపు నందు ముఖ్యంగా గైనకాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్ తదితర విభాగాలకు చెందిన ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉమెన్ పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులకువైద్యపరీక్షలునిర్వహిస్తున్నారు. ప్రతికుటుంబంలోఅమ్మాయిచదువుపైనేకుటుంబం, సమాజాభివద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. గత 30, 40 సంవత్సరాల వెనక్కి చూస్తే అప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు పెను మార్పులుసంతరించుకున్నాయన్నారు. గతంలో అమ్మాయి అంటే పెళ్లి , పిల్లలు, కుటుంబం అనే ఆలోచన మాత్రమే ఉండేదన్నారు. నేటి పరిస్థితులు అందుకుభిన్నంగాఉన్నాయన్నారు. ఇప్పుడు అబ్బాయిలను దాటిఅమ్మాయిలుదూసుకుపోతున్నారన్నారు.