నరసన్నపేట మేజర్ పంచాయతీ లోని స్థానిక జగన్నాథపురానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైనట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వై. సింహాచలం తెలిపారు. స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రెoడో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 3న కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.