విజయనగరం: అగ్ని ప్రమాదంలో రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి గజపతినగరం మండలం లోని రామన్నపేట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రుంకాన అచ్చియ్యమ్మ, కవులూరు అచ్చురాజులకు చెందిన పూరిల్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో వడ్రంగి సంబంధించిన పరికరాలు కాలిపోవడంతో ఆస్తి నష్టం బాగా జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పలువురు అంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం లోనే అగ్నిమాపక కేంద్రం అధికారి అప్పారావు తన సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.