నెల్లూరు జిల్లా కావలి పట్టణం సోమవారం గగుర్పొడిచే వార్తతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శివారు ప్రాంతం వెంకయ్యగారి పాలెం లోని ప్రైవేట్ లేఔట్ లో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయం కల్లు గీత కై వచ్చిన కార్మికుడు మహిళను సజీవ దహనం చేశారన్న సమాచారం ఇచ్చాడు అన్నారు. సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళను ఎక్కడో చంపి ఇక్కడ దహనం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తామని తెలియజేశారు.