నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఘోరం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మహిళను సజీవదహనం చేశారు. కావలి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన శివారు ప్రాంతం అయిన వెంగయ్యగారి పాలెం లేఔట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న కావలి ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.