తిరుమలలోని శ్రీవారిని నిన్న 61,052 మంది భక్తులు దర్శించుకున్నారు. 27వేల 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్నకానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.57 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సామాన్య భక్తుడి మాదిరిగా క్యూ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయం లోపల శ్రీవారి సేవలో ఉన్న నిజామాబాద్ కు చెందిన లావణ్య తో పాటు వారి గ్రూప్ సభ్యులు భక్తులకు చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు.సామాన్య భక్తుల విషయంలో ఓర్పు, సహనంతో వ్యవహరించి దర్శనం చేయించి పంపాలని వారికి సూచించారు. శ్రీవారి సేవ రూపంలో భగవంతుడు భాగ్యం కల్పించారని, ఏ ప్రాంతంలో సేవ చేసినా స్వామి వారికి చేసినట్లు గానే భావించాలని చెప్పారు.