తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం మారేడుబాక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి పెండ్యాల రమణ (50) అనుమానాస్పద స్థితిలో పంట బోదిలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం నాలుగు రోజులు క్రితం తన అన్నతో కలిసి చేలో పురుగులు మందు కొట్టి ఇంటికి వస్తుండగా రమణ అదృశ్యమయ్యాడు. తన కంటే ముందు వెళ్లిపోవడంతో ఇంటికి వెళ్లాడనుకున్నానని అనుకున్నారు, అయితే ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో గాలింపు చేపట్టినట్లు మృతుని సోదరుడు పెండ్యాల వీరబాబు విలేకరులకు తెలిపారు.
రమణ కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుండేవని గత నాలుగు రోజులుగా ఇంటికి వచ్చే దారి మొత్తం వెతుకుతూనే ఉన్నామని పేర్కొన్నారు. కాగా పంట బోదె నుండి దుర్వాసన రావడంతో ఈ రోజు గుర్తించగలిగామన్నారు. కాగా మృతునికి భార్యా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫిట్స్ కారణంగా ప్రమాదానికి గురై మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని, ప్రభుత్వమే తన సోదరుని కుటుంబాన్ని ఆదుకుని న్యాయం చేయాలని మృతుని సోదరుడు విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనపై పోలీస్ లకు ఇంకా సమాచారం అందించాల్సి ఉంది.