వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించేలా కృషి చేసినందుకు అమలాపురం పార్లమెంటరీ ఐటీడీపీ పురస్కారం అందుకున్నట్లు ఆ విభాగం అధ్యక్షుడు మానేపల్లి బాలాజీవేమా తెలిపారు. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.